గురుకులాల్లో ఆహార భద్రతపై ఎన్ఐఎన్ సహకారం

గురుకులాల్లో ఆహార  భద్రతపై ఎన్ఐఎన్ సహకారం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు హైదరాబాద్​లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సహకారం తీసుకుంటున్నది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 268 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఉన్నాయి.

వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతిరోజు భోజనంతో పాటు స్నాక్స్ ను అందించే కామన్ డైట్ ప్రోగ్రామ్​ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, ఆహార నాణ్యత లోపించిందని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.