శ్రీనగర్‌లో ఆర్మీ ట్రక్‌ లోయలో పడి.. ప్రాణాలు కోల్పొయిన జవాన్

శ్రీనగర్‌లో ఆర్మీ ట్రక్‌ లోయలో పడి.. ప్రాణాలు కోల్పొయిన జవాన్

జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీ ప్రయాణిస్తున్న ట్రక్ అదుపుతప్పి లోయలో పడింది. ఆ ప్రమాదంలో ఓ సైనికుడు మృతి చెందగా.. తొమ్మిది మంది జవాన్లు గాయపడ్డారు. 

శ్రీనగర్ కు చెందిన ఆర్టీ బేస్ క్యాంప్ వాహనం శుక్రవారం రాత్రి 15 మందితో కుల్గామ్ లోని DH పోరా ప్రాంతానికి వెళ్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ యాక్సిడెంట్ జరగగా.. శనివారం ఆర్మీ అధికారులు వివరాలు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించినట్లు.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ALSO READ | జైళు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ.. ఏడుగురు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్