గ్రూప్ 1లో నిర్మల్ విద్యార్థికి 455 మార్కులు

గ్రూప్ 1లో నిర్మల్ విద్యార్థికి 455 మార్కులు

నిర్మల్, వెలుగు: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో నిర్మల్​కు చెందిన ఎర్రవోతు సాయి ప్రణయ్ సత్తా చాటాడు. 455 మార్కులు సాధించారు. ప్రభుత్వ టీచర్ ఎర్రవోతు ముత్తన్న–శ్యామల కొడుకు సాయి ప్రణయ్ హైదరాబాద్​లో బీటెక్ పూర్తి చేశాడు. మొదటిసారి గ్రూప్ 1 పరీక్షకు హాజరై జిల్లా టాపర్​గా నిలిచాడు. తన కొడుకుకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం లభిస్తుందని తండ్రి ముత్తన్న ఆనందం వ్యక్తం చేశారు. స్థానికులు సాయి ప్రణయ్​ని అభినందించారు. 

గ్రూప్​ 2లో శివకృష్ణకు 19వ ర్యాంక్

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ శివకృష్ణ 412.050 మార్కులతో గ్రూప్​ 2లో రాష్ట్రంలో 19 ర్యాంకు, జోన్​లో 4వ ర్యాంకు సాధించాడు. జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ–వాణిశ్రీ దంపతుల కొడుకు జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ లో చదివి ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించారు.  గతేడాది ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో ఆడిట్ సెక్షన్​లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల సాయిరాం గౌడ్ గ్రూప్ 2 ఫలితాల్లో  స్టేట్ లెవల్​లో 191 ర్యాంక్ సాధించాడు. సాయిరా ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయితీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్​2కు ప్రిపేర్​ అయ్యి సత్తా చాటాడు.