BUDGET 2024 -2025 : టెలికాం శాఖకు రూ.1.28 లక్షల కోట్లు

BUDGET 2024 -2025 : టెలికాం శాఖకు రూ.1.28 లక్షల కోట్లు

–న్యూఢిల్లీ: తాజా బడ్జెట్ లో టెలికాం శాఖకు నిర్మలా సీతారామన్  రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. టెలికాం శాఖలోని ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటికీ ఈ కేటాయింపులు చేశారు. అందులో సింహ భాగం బీఎస్ఎన్ఎల్​కు రూ.82,916 కోట్లు కేటాయించారు.

మొత్తం కేటాయింపుల్లో బీఎస్ఎన్ఎల్, మహానగర్  టెలి ఫోన్  నిగమ్  లిమిటెడ్​​కు రూ.లక్షపైనే ఉన్నాయి. టెలికాం శాఖ ఉద్యోగులకు పెన్షన్  బెనిఫిట్లు అందించేందుకు రూ.17,510 కోట్లు కేటాయించారు.