- రాష్ట్రాలు ఒప్పుకుంటే వెంటనే జీఎస్టీ కిందికి పెట్రోల్
- ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకురావడానికి జీఎస్టీ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు. ఇది జరగాలంటే జీఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలన్నీ కలిసి కట్టుగా ముందుకు రావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పడుతోంది. ‘ వాళ్లు (రాష్ట్రాలు) రేటును ఫిక్స్ చేయాలని అనుకుంటే, జీఎస్టీ కిందకు పెట్రోలియం ప్రొడక్ట్లను తీసుకురావాలని కలిసి కట్టుగా నిర్ణయించుకొని ముందుకు రావాలి. వస్తే వెంటనే అమల్లోకి తెస్తాం’ అని ఓ ఇంగ్లీష్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీతారామన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రాలను బట్టి పెట్రోలియం ప్రొడక్ట్లపై ట్యాక్స్ డిఫరెంట్గా ఉంది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకొస్తే రాష్ట్రాలు రెవెన్యూ లాస్ అవుతాయి.