![స్కూల్లో పాఠాలు చెబుతున్న నిత్యా మీనన్](https://static.v6velugu.com/uploads/2023/01/Nithya-Menon-is-a-teacher-in-a-government-school_MKNSH9PDUW.jpg)
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ ఇప్పుడు టీచర్ గా మారింది. అయితే అది సినిమాలో అనుకుంటే పొరపాటే.. నిజంగానే ఆమె టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ఇన్ స్టా గ్రాంలో షేర్ చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం నిత్య తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణాపురం గ్రామానికి వెళ్లింది. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుండగా..బ్రేక్ టైంలో పక్కనే ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. అక్కడ స్యూల్ పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడిన నిత్య ఆ తర్వాత వారికి పాఠాలు బోధించింది. ఇంగ్లీష్ బుక్ లో కథను పిల్లలకి తెలుగులో వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
కృష్ణాపురం గ్రామంలోని ఈ పిల్లలతో న్యూ ఇయర్ డే ఆనందంగా గడిచిందంటూ నిత్యామీనన్ ఇన్ స్టా గ్రాం పోస్టులో రాసుకొచ్చింది. పల్లెటూర్లలో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఆనందంతో గడుపుతారని.. వాళ్లు తన చుట్టూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటానని చెప్పింది.