ఇది నిజం : విమానం లాంటి బస్సు.. 132 సీట్లతో రోడ్లపైకి వస్తుంది..!

ఇది నిజం : విమానం లాంటి బస్సు.. 132 సీట్లతో రోడ్లపైకి వస్తుంది..!

దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి.. ఆ బస్సుల్లో సీట్లు ఎన్నో తెలుసా.. అక్షరాల 132 సీట్లు ఉంటాయి.. విమానం మాదిరిగానే ఉంటుంది.. కాకపోతే ఇది బస్సు. ఈ బస్సులో విమానంలో ఉన్నట్లే బస్సు హోస్టస్ ఉంటారు.. ఫుడ్ పెడతారు.. టీ ఇస్తారు.. స్నాక్స్ కూడా ఉంటాయి.. జాతీయ రహదారులపై ఈ బస్సులు అతి త్వరలోనే రోడ్డెక్కబోతున్నాయి. దేశంలో పైలెట్ ప్రాజెక్టు కింద.. టాటా కంపెనీతో కలిసి.. కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తుంది. మరో ఏడాది, ఏడాదిన్నరలోనే 132 సీట్లతో బస్సులు రోడ్డెక్కబోతున్నట్లు కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

భారతదేశంలో కాలుష్యం తగ్గించటానికి పలు రకాలుగా రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారాయన. లీటర్ పెట్రోల్ ను 120 రూపాయలు చెల్లించే బదులు.. 60 శాతం పెట్రోల్. 40 శాతం ఇథనాల్ వినియోగం వల్ల డబ్బు ఆదా అవుతుందని.. కాలుష్యం తగ్గుతుందని వివరించారు. 

బస్సు రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారాయన. ప్రస్తుతం 40 సీట్ల డీజిల్ బస్సు నడపటానికి కిలోమీటర్ కు 115 రూపాయలు ఖర్చవుతుందని.. అదే ఎలక్ట్రికల్ ఏసీ బస్సు అయితే 41 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. అదే 132 సీట్ల బస్సును తీసుకురావటం వల్ల ప్రయాణికుడు టికెట్ ఖర్చు 20 శాతం ఆదా అవుతుందని.. పొల్యూషన్ తగ్గుతుంది.. ప్రభుత్వాలపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని స్పష్టం చేశారు. 

విమానం మాదిరిగానే ఈ 132 సీట్ల బస్సు ఉంటుందని.. ఇందులో బస్సు హోస్టర్స్, ఫుడ్ అన్నీ ఉంటాయని.. జాతీయ రహదారుల్లో లాంగ్ జర్నీ కోసం వీటిని తీసుకురాబోతున్నట్లు వివరించారు. ప్రస్తుతం మూడు బస్సులు తిరిగే చోట.. ఒక్క బస్సులోనే.. మూడు బస్సుల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేయొచ్చని.. టికెట్ ఖర్చు కూడా 20 శాతం తగ్గుతుందన్నారు. టాటా కంపెనీతో కలిసి నాగపూర్ లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని త్వరలోనే రోడ్డెక్కించనున్నట్లు వివరించారు నితిన్ గడ్కరీ..