పోటీ పరీక్షలు రాసేవారి కోసం డిజిటల్ లైబ్రరీ : రాజీవ్​గాంధీ హనుమంతు

 పోటీ పరీక్షలు రాసేవారి కోసం డిజిటల్ లైబ్రరీ :  రాజీవ్​గాంధీ హనుమంతు
  • కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు 

నిజామాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్​ సర్వీస్​తో కూడిన డిజిటల్​ లైబ్రరీ అందుబాటులోకి తెచ్చామని, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు లక్ష్యంతో చదవాలని కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. బుధవారం  నగరంలోని జిల్లా లైబ్రరీలో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్​ లైబ్రరీని కలెక్టర్​ ప్రారంభించి మాట్లాడారు. పోటీ పరీక్షలకు కావాల్సిన మరిన్ని బుక్స్, జర్నల్స్ సమకూరుస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల  నుంచి లైబ్రరీకి వచ్చే యువత కోసం చైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి మధ్యాహ్న భోజనం పెట్టించడం సంతోషకరమన్నారు. 

పాత డీఈవో ఆఫీస్​ బిల్డింగ్​ను స్టడీ రూమ్స్​గా వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇటీవల జిల్లాకు చెందిన 160 మంది యూత్ పోటీ పరీక్షలు రాసి సర్కారు కొలువులు సాధించడం గర్వకారణమన్నారు. స్టేట్​ ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్ బిన్​ హందాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్​రెడ్డి, గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి, రాజారెడ్డి, నరేష్​రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.