డ్రగ్స్ పై​ ఉక్కుపాదం మోపుతాం

డ్రగ్స్ పై​ ఉక్కుపాదం మోపుతాం

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో డ్రగ్స్​ కంట్రోల్​పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఏపీ, ఒడిశా బార్డర్​ నుంచి మహారాష్ట్రకు స్మగ్లింగ్​ జరుగుతుందన్నారు. రోడ్, రైలు మార్గాలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి వినియోగించిన వారితో పాటు అమ్మిన​వారికి కఠిన శిక్షలు పడేలా కోర్టులకు ఆధారాలు అందించాలన్నారు. 

కల్తీ కల్లు కోసం ప్రమాదకరమైన క్లోరోఫాం, అలఫ్రిజోలం ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులను వ్యసనాల బారీ నుంచి బయటపడేయడానికి డీ -అడిక్షన్​ సెంటర్​ ఓపెన్​ చేయిస్తామన్నారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ, ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​ సోమిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి, ఎన్​ఫోర్స్​మెంట్​ అసిస్టెంట్​  సూపరింటెండెంట్​ డీబీసీ నాయక్, మెడికల్, డ్రగ్​ కంట్రోల్, ఐసీడీఎస్​ అధికారులు పాల్గొన్నారు.