
వర్ని, వెలుగు: వర్ని, రుద్రూర్ పోలీస్స్టేషన్లను శనివారం సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్లు, కంప్యూటర్ సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. బైక్లపై వెళ్లేటపుడు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. గంజాయికి బానిసైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీ సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్, వర్ని ఎస్ఐ సాయన్న, మహేశ్, సిబ్బంది ఉన్నారు.