
- ఆయకట్టు భూములకు సాగునీరు అందట్లేదని రైతులు ఆగ్రహం
- వారం పాటు వదలుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ
- నిజామాబాద్ జిల్లా సాలూర క్యాంప్ పంచాయతీ ఆఫీసు వద్ద ఘటన
బోధన్,వెలుగు : నిజాంసాగర్ చివరి ఆయకట్టు గ్రామాలకు సాగు నీరు అందకపోవడంతో నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్అధికారులను రైతులు శుక్రవారం నిర్బంధించారు. ఈనెల 21న నిజాంసాగర్ నీటిని 4వ విడతగా వదిలారు. వారం రోజులైన డి–28 కెనాల్ కింద చివరి ఆయకట్టు గ్రామాలైన కొప్పర్తి క్యాంప్, కుమ్మన్పల్లి, సాలూర క్యాంప్, జాడి జమాల్పూర్, పత్తేపూర్లోని వరి, మొక్కజొన్న పంటలకు నీరు అందడంలేదు.
దీంతో ఇరిగేషన్అధికారులు డీఈ భూమన్న, ఏఈలు శృతి, సత్యనారాయణ వద్దకు రైతులు వెళ్లి సాలూర క్యాంప్ పంచాయతీ ఆఫీసులో నిర్బంధించి తాళం వేశారు. జిల్లాస్థాయి అధికారులు హామీ ఇచ్చేవరకు వదిలేదిలేదన భీష్మించారు. బోధన్రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ మచ్చేందర్రెడ్డి వెళ్లి రైతులతో మాట్లాడి నచ్చజెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డికి రైతులు సాగునీటిపై ఫిర్యాదు చేయగా వెంటనే ఇరిగేషన్ ఎస్ఈ రాజేశేఖర్ తో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల వరకు పంటలకు సాగునీటిని అందించేందుకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.