
- ఇప్పటికే రూ.22 కోట్లు మంజూరు
- గవర్నమెంట్ సలహాదారుడు
- షబ్బీర్అలీ
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లా సర్కార్ హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.85 కోట్ల నిధులు మంజూరయ్యాయని గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్అలీ తెలిపారు. శుక్రవారం హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈనెల 8న మంజూరు చేసిన రూ.22 కోట్లకు ఇవి అదనమన్నారు. నిజామాబాద్లోని 750 బెడ్స్ జీజీహెచ్లో ఇప్పుడున్న ఒక లిఫ్ట్కు అదనంగా మరో రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రైనేజీ రిపేర్స్, తాగునీటి వసతి పెంపు సహా సమగ్ర రిన్నొవేషన్ పనుల కోసం మొత్తం రూ.63 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మిగితా నిధులను కామారెడ్డిలోని 250 బెడ్స్ జిల్లా హాస్పిటల్లో సీటీ స్కాన్ ఏర్పాటు చేస్తామన్నారు. ట్రామా సెంటర్ నిర్మిస్తామన్నారు.
దోమకొండలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 పడకల నుంచి 50 పడకలకు పెంచుతామని వివరించారు. వైద్య విధాన పరిషత్ జీవో 137 ద్వారా మంజూరు చేసిన రూ.22 కోట్లు సివిల్ నిర్మాణాలు, హాస్పిటల్స్లో పరికరాల కొనుగోలుకు ఖర్చు చేస్తామన్నారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సాంహా త్వరలో ఉమ్మడి జిల్లా విజిట్ చేసి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. సమావేశంలో స్టేట్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, హెల్త్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేందర్కుమార్, అదనపు డైరెక్టర్ వేముల థామస్, స్టేట్ ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ సహదేవ్రావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్నాయక్, నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శివప్రసాద్, కామారెడ్డి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫరీదాబేగం, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శివప్రసాద్ ఉన్నారు.