బీఆర్ఎస్ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదు: ఎంపీ అర్వింద్

బీఆర్ఎస్ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదు: ఎంపీ అర్వింద్

 బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్.బీఆర్ఎస్ ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి  కాంగ్రెస్ లో బీఆర్ఎస్  విలీనం అయినట్లేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్నారు ఎంపీ అర్వింద్.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను,మహిళలను మోసం చేసిందన్నారు. రూ.2లక్షలు రైతులు చెల్లించాక ప్రభుత్వం మాఫీ చేసేదేంటని ప్రశ్నించారు.రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ దక్కిందన్నారు. 

Also Read :- బీటెక్ స్టూడెంట్ను చంపింది స్నేహితులే

 రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని సెటైర్ వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చేసినతీరు అభినందనీయమన్నారు అర్వింద్.   కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై రోజోజుకు అసహనం పెరుగుతుదన్నారు. 

పార్టీ అభ్యర్థులను, పార్టీని గెలిపించే వారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని చెప్పారు. బీజేపీ తలపెట్టిన ఆగస్టు 24 రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అర్వింద్ .