మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలు ప్రారంభం

మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలు ప్రారంభం

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ లోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జెండాఊపి ప్రారంభించారు.  

ఖేలో ఇండియా ద్వారా నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో  అర్బన్ శాసనసభ్యుడు  ధన్ పాల్ సూర్యనారాయణ , అసిస్టెంట్ డైరెక్టర్  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  కుమారి నిషా విద్యార్థి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు  ఈగ సంజీవరెడ్డి, నిజామాబాద్ జిల్లా సైక్లింగ్  అసోసియేషన్ అధ్యక్షులు  కృపాకర్ రెడ్డి , తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  విజయకాంతరావు , వందలాదిమంది క్రీడాకారిణులు పాల్గొన్నారు.