నారాయణ ఖేడ్ మున్సిపల్​ చైర్​పర్సన్, వైస్ చైర్మన్​పై అవిశ్వాసం

నారాయణ ఖేడ్ మున్సిపల్​ చైర్​పర్సన్, వైస్ చైర్మన్​పై అవిశ్వాసం

నారాయణఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా బేగం నజీబ్, వైస్ చైర్మన్ అహీర్ పరశురాంపై కాంగ్రెస్  కౌన్సిలర్లు అవిశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్​ఆఫీస్​ఏఓ పరమేశ్వర్ ను కలిసి సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీస్​ను అందజేశారు. గత ఎన్నికల్లో ఖేడ్​లోని 15 వార్డుల్లో  8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్​గెలుచుకుంది. 

అయితే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్​చైర్మన్​పదవులు దక్కించుకుంది. 15వ వార్డు నుంచి ఎన్నికైన రుబీనా బేగం నజీబ్ చైర్​పర్సన్​గా, వైస్ చైర్మన్ గా 5వ వార్డు నుంచి గెలిచిన అహీర్ పరశురాం ఎన్నికయ్యారు. 

ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో వార్డు కౌన్సిలర్​సంధ్యారాణి రామకృష్ణ, 12వ వార్డు కౌన్సిలర్ మాజీద్, 8వ వార్డు కౌన్సిలర్ నర్సింహులు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కు బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే.. మున్సిపల్ చైర్​పర్సన్ గా ఆరో వార్డు కౌన్సిలర్​ఆనంద్ స్వరూప్ షెట్కార్ ను, వైస్ చైర్మన్​గా మూడో వార్డు కౌన్సిలర్​దారం శంకర్​ను ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.