ఖానాపూర్ బల్దియాలో నెగ్గిన అవిశ్వాసం

ఖానాపూర్ బల్దియాలో నెగ్గిన అవిశ్వాసం
  • పదవులు కోల్పోయిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్​

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్​పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు వీరిపై అవిశ్వాసం ప్రకటిస్తూ జనవరి 5న కలెక్టర్ ఆశిష్​కు అవిశ్వాస నోటీసును అందజేశారు. ఈమేరకు సోమవారం ఆర్డీఓ రత్న కల్యాణి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్​పై అవిశ్వాసానికి 9 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి మద్దతు పలికారు.

Also Read : గొల్లపల్లిలో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ 

బీఆర్ఎస్​కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్​పై ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు వ్యతరేకంగా ఓటు వేయడం చర్చనీయంగా మారింది.  నూతన చైర్మన్,  వైస్ చైర్మన్ ఎన్నికలు కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో నిర్వహిస్తామని ఆర్డీఓ తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యే బొజ్జు పటేల్​ను ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ కాంగ్రెస్ ​హస్తగతం కావడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు.