పెండ్లికి పైసల్లేవని.. రూ.52 లక్షల దోపిడీ

పెండ్లికి పైసల్లేవని.. రూ.52 లక్షల దోపిడీ

జీడిమెట్ల, వెలుగు : హైదరాబాద్ కొంపల్లి లక్ష్మినగర్​లోని గెటేడ్ ​కమ్యూనిటీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి సోమవారం తెలిపిన మేరకు.. మెదక్ ​జిల్లాకు చెందిన ఆనంద్​(21)  కొంపల్లిలోని ఓ గెటేడ్​కమ్యూనిటీలో ఎలక్ట్రిషియన్. పెండ్లి చేసుకునేందుకు ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు.  ఇదే కమ్యూనిటీలో ఉండే  వెలగపూడి భవానీ శంకర్​ కుటుంబం ఊరెళ్లడం చూశాడు.  

ఆ ఇంట్లోకి ఎలా వెళ్లాలో తెలిసిన ఆనంద్..​ ఇంటి గ్రిల్స్​ కట్​చేసి బెడ్​రూమ్ లోకి వెళ్లాడు.  బీరువాలో ని రూ.52.50 లక్షల నగదును దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి  ఆనంద్​ను అరెస్ట్ ​చేశారు. నిందితుడి నుంచి రూ.43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.