
- చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ
అమరావతి: కొత్త పిఆర్సీ అమలు వల్ల రాష్ట్రంలో ఎవరి జీతాలు తగ్గ లేదని.. కావాలంటే పాత పిఆర్సీతో కోత్త పిఆర్సీ పోల్చి చూడాలని చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన నేపధ్యంలో సాయంత్రం ఆర్ధిక శాఖ అధికారులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు చర్చలు ద్వార మాత్రమే పరిష్కారం అవుతాయని చీఫ్ సెక్రెటరీ పేర్కొన్నారు. చర్చలు జరపకపోతే సమస్యలు ఏలా పరిష్కారం అవుతాయని ఆయన ప్రశ్నించారు. నిరసనలు ,ఆందోళనలతో ప్రయేజనం లేదు, ఐఆర్ తో పీఆర్సీని పోల్చి చూడటం తగదు.. డి.ఏ మాత్రం పెంచితే 10 వేల కోట్లు మిగిలేవి, కానీ కొత్త పిఆర్సీ వల్ల 10వేల కోట్ల రుపాయల భారం పడుతోందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో ఇవాళ కొత్త కేసులు 4,605 మరణాలు 10
ఉద్యోగులు అన్న ఆ మాటతోనే వెనుకడుగేశా
నష్టం జరుగుతున్నప్పుడు తిరగబడాల్సిందే