
- డైట్ కాలేజీల్లో సార్లేరి?
- 20 ఏండ్ల సంది రిక్రూట్మెంట్ బంద్
- 10 కాలేజీల్లో మొత్తం 288 పోస్టులు.. వీటిలో 267 ఖాళీ
- 17 మందే రెగ్యులర్ లెక్చరర్లు, నలుగురే ప్రిన్సిపాల్స్
- 70 సీనియర్ లెక్చరర్ పోస్టులూ ఖాళీగానే
హైదరాబాద్, వెలుగు: కాబోయే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన కాలేజీల్లోనే లెక్చరర్లకు కరువొచ్చింది. రాష్ట్రంలో10 డైట్ కాలేజీల్లో 21 మంది సార్లు మాత్రమే ఉన్నారు. మొత్తం 288 పోస్టులను శాంక్షన్ చేయగా 267 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్లేక డైట్ కాలేజీలన్నీ వెలవెలబోతున్నాయి. 20 ఏండ్ల నుంచి ఆ కాలేజీల్లో పోస్టులను భర్తీ చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరైనా రిటైర్ అయితే ఆ పోస్టు ఖాళీగా ఉంటోంది. సర్వీస్రూల్స్సమస్యను సాకుగా చూపుతూ కాలేజీల్లో రిక్రూట్మెంట్ను ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి.
కోర్టు ఆదేశాలతో..
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకొకటి చొప్పున10 డైట్ కాలేజీలున్నాయి. వీటన్నింటిలో 10 ప్రిన్సిపాల్ పోస్టులు, 70 సీనియర్ లెక్చరర్పోస్టులు, 208 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ లెక్చరర్ పోస్టుల్లో 70కి 70 ఖాళీగానే ఉన్నాయి. చివరిసారిగా ఈ కాలేజీలకు 1998లో 30 శాతం మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నట్టు యూనియన్లు తెలిపాయి. ఆ తర్వాత నుంచి అన్ని పోస్టులనూ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కోర్టు ఆదేశాల వల్ల 200 నుంచి రిక్రూట్మెంట్ ఆగింది.
ఉన్నోళ్లకూ వేరే పనులు
ఇప్పుడున్న రెగ్యులర్ స్టాఫ్లోనూ కొందరు వేరే డ్యూటీలు చేస్తున్నారు. నలుగురు ప్రిన్సిపాళ్లలో ఇద్దరు ఆదిలాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఇన్చార్జి డీఈవోలుగా కొనసాగుతున్నారు. రాష్ట్రమంతటా17 మంది రెగ్యులర్ లెక్చరర్లుండగా, వారిలో ఐదుగురు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నారాయణపేట, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇన్చార్జ్ డీఈవోలుగా పనిచేస్తున్నారు. నల్గొండలో ఒక్కరే రెగ్యులర్ లెక్చరర్ఉండగా, మిగిలిన ప్రిన్సిపాల్, సీనియర్ లెక్చరర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్ డైట్ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లుమాత్రమే రెగ్యులర్కాగా.. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వరంగల్ప్రిన్సిపాల్కూడా ఇన్చార్జ్ డీఈవోగా ఉండటంతో, ఆ కాలేజీలో అంతా గెస్ట్ లెక్చరర్లే పని చేస్తున్నారు. మహబూబ్నగర్ కాలేజీలో ఐదుగురు, కరీంనగర్లో ముగ్గురు, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, మెదక్, నిజామాబాద్కాలేజీల్లో ఒక్కొక్కరు చొప్పున రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు.
వచ్చే నెల నుంచే కాలేజీలు
ఫిబ్రవరి ఫస్ట్ నుంచి డైట్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ లెక్చరర్లు లేకపోయినా కనీసం గెస్ట్ లెక్చరర్లను తీసుకోలేదు. దీంతో స్టూడెంట్స్ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, డైట్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.