ఏపీలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 2వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది. వైసీపీ పోటీ చేస్తే జులై 12న ఉదయం 9 గంటల  నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సీ.రామచంద్రయ్య, ఇక్బాల్‌పై అనర్హత వేటు పడటంతో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. వైసీపీ పోటీ చేయకపోతే మాత్రం ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ముందే ప్రకటిస్తారు.