
కార్తీక మాసం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. కంచి కామాక్షి, శృంగేరి శారదాంబికాకు కోటి పసుపు కొమ్ముల సుమంగళి పూజను ఘనంగా నిర్వహించారు. అలంపూర్ జోగులాంబ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు సప్త హారతి కాంతులతో మహాదేవుడిని కొలిచారు.