ఫిబ్రవరిలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌‌‌‌ షూటింగ్‌‌‌‌

ఫిబ్రవరిలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌‌‌‌ షూటింగ్‌‌‌‌

గతేడాది ‘దేవర’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..  ప్రస్తుతం  హిందీలో హృతిక్ రోషన్‌‌‌‌తో కలిసి   ‘వార్‌‌‌‌‌‌‌‌2’ చిత్రంలో  నటిస్తున్నాడు. ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌‌‌‌తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా, ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. రెండో వారం లేదా, మూడో వారంలో సెట్స్‌‌‌‌కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  కర్ణాటకలోని మంగళూరులో ఫస్ట్ షెడ్యూల్‌‌‌‌ను  మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ షెడ్యూల్‌‌‌‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌‌ షూట్ చేయనున్నట్టు సమాచారం.  పీరియాడిక్ జానర్‌‌‌‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌‌‌‌ డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపించబోతున్నాడట. ఇందులో  హీరోయిన్‌‌‌‌గా రుక్మిణీ వసంత్‌‌‌‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే  టైటిల్ పరిశీలనలో ఉంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ప్రశాంత్‌‌‌‌ నీల్‌‌‌‌ రూపొందించనున్న ఈ మూవీ సైతం రెండు భాగాలుగా వస్తుందనే టాక్ వినిపిస్తోంది.