ఒడిశాలోని కలాం దీవి నుంచి అగ్ని-P అణు క్షిపణి ప్రయోగం

ఒడిశాలోని కలాం దీవి నుంచి అగ్ని-P అణు క్షిపణి ప్రయోగం

–వ్యూహాత్మక అగ్ని ప్రైమ్‌ క్షిపణి (Agni-P)ని ఇవాళ (శనివారం) భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ఉదయం 11.06 గంటలకు ..DRDO అత్యాధునిక అగ్ని-పి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-పి మిస్సైల్ ను నెక్ట్స్ జనరేషన్ క్షిపణిగా DRDO చెబుతోంది. అణు వార్ హెడ్లను మోసుకెళ్తుంది. గాల్లోకి దూసుకుపోయిన Agni-P పరీక్ష పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.

తూర్పు తీర ప్రాంతం పొడవునా ఏర్పాటు చేసిన వివిధ టెలీమెట్రీ వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ట్రోల ఆప్టికల్ కేంద్రాలు, యుద్ధ నౌకల సాయంతో ఈ మిసైల్ గమనాన్ని డీఆర్డీవో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. ఇందులోని కీలక వ్యవస్థల పనితీరు అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు. Agni-P రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి. దీంట్లో డ్యూయల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు పొందుపరిచారు. తాజా పరీక్ష ద్వారా ఇందులోని సాంకేతిక వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తున్నట్టు తెలిపింది. ఇవాళ జరిపిన పరీక్ష ద్వారా క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధికి చేరువైందని త్వరలో సైన్యంలో ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

Agni-P పరీక్ష విజయవంతం కావడంతో DRDO శాస్త్రవేత్తలను దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.