ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్

ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్
  • పర్మిషన్ ​ఇచ్చిన సిటీ సీపీ సీవీ ఆనంద్

బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో కొనసాగుతున్న నుమాయిష్​ను రెండు రోజులు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 15తో ఎగ్జిబిషన్ ముగుస్తుంది. ఎగ్జిబిషన్​సొసైటీ అధికారులు మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిసి మరో రెండు రోజులు పొడిగించాలని రిక్వెస్ట్​చేశారు. అందుకు సీపీ ఓకే చెప్పారు. దీంతో నుమాయిష్ ఈ నెల 17 వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి వెల్లడించారు. సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.