
నిజామాబాద్ లో గణేశ్ నవరాత్రుల సందర్భంగా నగరంలోని వివిధ కాలనీలలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఒక్కో మండపంలో ఒక్కో రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మండపాలలో కొలువైన వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వినాయక్ నగర్లో బాలగణేశ్, బోర్గంలో కిసాన్, జవాన్, కోటగల్లి లో అయోధ్య రామలల్లాగా, గాజుల్పెట్లో కాణిపాకం వరసిద్ధి వినాయకుడిగా కొలువు దీరాడు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్