
హనుమకొండ, వెలుగు: డాక్టర్ ముసుగులో క్షుద్రపూజలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్టాస్క్ఫోర్స్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల అరెస్ట్కు సంబంధించిన వివరాలను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ.బారి హనుమకొండ పీఎస్లో సోమవారం వెల్లడించారు. హనుమకొండ నయీంనగర్కు చెందిన సయ్యద్ ఖాదిర్అహ్మద్ ఇంటర్వరకు చదివాడు. కరీంనగర్లోని ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్ గా పని చేసినపుడు అల్లోపతి ట్రీట్మెంట్పై అవగాహన పెంచుకున్నాడు. తండ్రి కరీముల్ల ఖాద్రీ గతంలో పూజలు చేసి తాయత్తులు కట్టే పని చేయగా.. అది కూడా నేర్చుకున్నాడు. అనంతరం నయీంనగర్లోని ఇంట్లో అన్న కొడుకు సయ్యద్షబ్బీర్అహ్మద్తో కలిసి ఆసుపత్రి ప్రారంభించాడు.
పర్మిషన్ లేకుండా అందులోనే ల్యాబ్ కూడా నిర్వహిస్తూ తమ వద్దకు వచ్చే రోగులకు తోచిన టెస్టులన్నీ చేసేవారు. గిట్టనివారు చేతబడులు చేశారని, దెయ్యం పట్టిందని జనాలను నమ్మించి, పూజలు చేసి సమస్యను పరిష్కరిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేసేవారు.
ఇలా 35 ఏండ్లుగా ఖాదిర్డాక్టర్గా కొనసాగుతుండగా.. షబ్బీర్ హైదరాబాద్ఉప్పల్లో ఉంటూ అక్కడా ఇదే తీరుగా దందా స్టార్ట్ చేశాడు. అర్హత లేకుండా వైద్యం చేయడమే కాకుండా.. మూఢ నమ్మకాలతో జనాలను మోసం చేస్తున్నట్లుగా వరంగల్ టాస్క్ఫోర్స్, హనుమకొండ పోలీసులకు సమాచారం అందడంతో నయీంనగర్లోని ఖాదిర్ఇంటిపై జిల్లా వైద్యాధికారులు, పోలీసులు సోమవారం ఉదయం రైడ్ చేశారు. ఖాదిర్తోపాటు హైదరాబాద్లో రైడ్ చేసి షబ్బీర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. క్షుద్రపూజలతో పాటు నకిలీ వైద్యంలో వీరికి సహకరించిన నిందితుల బంధువులు యాకుబ్ బాబా, అతని భార్య సమ్రీన్, మరో బంధువు ఎండీ ఇమ్రాన్ పరారీలో ఉన్నారు.