జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

మల్హర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో పెద్దమ్మ గుడి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం లేపాయి. సోమవారం తెల్లవారుజామున గొర్రె పిల్లను బలిచ్చి, పసుపు, నిమ్మకాయ, కుంకుమలతో భయంకరంగా కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు.  ఈ విషయమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.