ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే..

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే..

అక్టోబర్ 2 నుంచి దసరా సెలవు మొదలు కానుండటంతో బాక్సాఫిస్ వద్ద సినిమా సందడి నెలకొంది. ఇప్పటికే గతవారంలో రిలీజ్ అయిన దేవర, సత్యం సుందరం చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వారంలో రిలీజ్ అయ్యే చిత్రాల గురించి తెలుసుకుందాం.

అయితే  అక్టోబర్ 4న ప్రముఖ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన 'స్వాగ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించగా వెటరన్ హీరోయిన్ మీరాజాస్మిన్, రీతూ వర్మ, దక్ష నాగర్కర్, సునీల్, రవిబాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ట్రైలర్ తో అలరించిన శ్రీవిష్ణు థియేటర్లో ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. 

ALSO READ | Saripodhaa Sanivaaram: నెట్‌ఫ్లిక్స్‌లో సరిపోదా శనివారం దూకుడు .. ఇండియాలోనే నంబర్ 1

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రంలో హీరో కూతురి పాత్రలో నటించిన సాయి ధన్సిక మెయిన్ లీడ్ పాత్రలో నటించిన 'దక్షిణ' చిత్రం కూడా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. అయితే క్రైమ్ & హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రం తెరకెకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఈరెండు చిత్రాలతో పాటూ విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'రోటి కపడ రొమాన్స్', ప్రముఖ సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటుస్తున్న 'రామ్ నగర్ బన్నీ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఈ వారంలో భారీ బడ్జెట్ చిత్రాలు లేకపోయినప్పటికీ  ఈ 4 చిత్రాలు మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు.