![ముగిసిన ఒడియా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్](https://static.v6velugu.com/uploads/2025/02/odia-food-and-craft-festival-ends-at--shilparamam-hyderabad_jhQrw8KeN9.jpg)
మాదాపూర్, వెలుగు: స్వాభిమాన్ ఒడియా ఉమెన్వరల్డ్ ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన ఒడియా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్ఆదివారం ముగిసింది. ఐపీఎస్డా. సౌమ్య మిశ్ర, కార్డియాలజిస్ డా. భరత్పురోహిత్, పద్మశ్రీ పతయత్సాహూలు ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లు గా హాజరయ్యారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్లో సిటీలోని ఒడిశాకు చెందిన కుటుంబాలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కథక్, ఒడిస్సీ, సంబల్పూరి, ఒడియా జానపద పాటలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన ఒడిశా వంటకాలు నోరూరించాయి.