
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత్రి గీతా మెహతా శనివారం ( సెప్టెంబర్ 17న) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆమె ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. గీతా మెహతాకు ఓ కుమారుడు ఉన్నారు. ఆమె భర్త, ప్రముఖ పబ్లిషర్ సోని మెహతా 2019లోనే మరణించారు.
ప్రముఖ రచయిత్రి, లఘుచిత్ర నిర్మాత, జర్నలిస్టుగా గీతా మెహతా అందరికీ సుపరిచితురాలు. 1943లో బిజూ పట్నాయక్, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు గీతా మెహతా జన్మించారు. ఆమె తండ్రి దివంగత బిజూ పట్నాయక్ ఒడిశాకు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆమె ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు, ప్రేమ్ పట్నాయక్కు సొంత అక్క.
ALSO READ: కవితను కేసీఆర్ జైలుకు పంపిస్తరు.. ఎన్నికల్లో సింపతి కొట్టేస్తరు : రేవంత్
గీతా మెహతా.. ‘కర్మా కోలా’, ‘స్నేక్ అండ్ ల్యాడర్స్’, ‘ఏ రివర్ సూత్ర’, ‘రాజ్’, ‘ది ఎటర్నల్ గణేష’ పుస్తకాలను రాశారు. గీతా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గీతా కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.