జాబ్ అన్నారు.. నిండా ముంచారు.. సికింద్రాబాద్లో రూ.1.39 లక్షల కొట్టేసిళ్లు

 జాబ్ అన్నారు.. నిండా ముంచారు.. సికింద్రాబాద్లో రూ.1.39 లక్షల కొట్టేసిళ్లు

బషీర్​బాగ్, వెలుగు: జాబ్ పేరిట ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 28 ఏండ్ల యువకుడు ఇటీవల ఆన్​లైన్ ద్వారా ఇన్వెస్ట్​మెంట్ బ్యాంకింగ్ కోర్స్ పూర్తి చేశాడు. తన రెస్యూమ్ జాబ్ సర్చ్ పోర్టల్ లో ఉందంటూ అతనికి రెండు నెలల కింద ఒకరు కాల్ చేశారు. ఆ తర్వాత ఆన్​లైన్​లో ఇంటర్వ్యూ నిర్వహించి, బెంగళూరులోని ఆటోస్ కంపెనీలో సీనియర్ అసోసియేట్ గా సెలెక్ట్ అయినట్లు తెలిపారు.

 అనంతరం బాధితుడి మెయిల్ కు ఆఫర్ లెటర్ ను పంపించారు. అయితే, జాబ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని,15 రోజులకు ఆ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. వారి మాటలను నమ్మిన యువకుడు పలు దఫాలుగా స్కామర్ సూచించిన అకౌంట్ కు మొత్తం రూ.1,39,584 ను బదిలీ చేశాడు. ఆ తర్వాత జాయినింగ్ డేట్ ను వాయిదా వేస్తూ వచ్చారు. అనుమానం వచ్చిన బాధితుడు చెల్లించిన డబ్బులను రిటర్న్ చేయాలని కోరగా , కాల్స్ , మెయిల్స్ కు స్పందించడం మానేశారు. దీంతో మోసపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు సోమవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.