ఇన్వెస్ట్ .. ప్రాఫిట్ పేరిట రూ.4.50 కోట్లు వసూలు

ఇన్వెస్ట్ .. ప్రాఫిట్ పేరిట రూ.4.50 కోట్లు వసూలు
  • 35 మందిని చీటింగ్ చేసిన నిందితుడి అరెస్ట్  

గచ్చిబౌలి, వెలుగు: ఇన్వెస్ట్ పేరిట రూ.4.50 కోట్లు వసూలు చేసి మోసగించిన నిందితుడిని సైబరాబాద్​ ఎకనామిక్ ​అఫెన్సెస్​ వింగ్​ అధికారులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు. సైబరాబాద్​ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్​తెలిపిన ప్రకారం.. బోరబండ రాణాప్రతాప్​నగర్​కు చెందిన రెండ్ల అజయ్​కుమార్​మెడికల్​ డిస్ర్టిబ్యూటర్.​ 2020 మే నెలలో ఏఐమైటీ ఫార్మా పేరుతో కంపెనీ స్టార్ట్ చేశాడు.

కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం ప్రాఫిట్​ఇస్తానని అల్లాపూర్​కు చెందిన కావలి శ్రీనివాస్​తో పాటు మరో 35 మంది వద్ద  రూ.4.50 కోట్లు వసూలు చేశాడు. బాండ్​పేపర్​కూడా రాసిచ్చాడు. ఏండ్లుగా ప్రాఫిట్.. ఇన్వెస్ట్ డబ్బులు ఇవ్వకపోతుండగా కావలి శ్రీనివాస్​ గత మార్చిలో సైబరాబాద్​ఎకనామిక్​అఫెన్సెస్​వింగ్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడు అజయ్​కుమార్​ను మంగళవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు.