ఆక్రమిత ఫారెస్ట్ ల్యాండ్ లో మొక్కలు నాటిన అధికారులు

ఆక్రమిత ఫారెస్ట్ ల్యాండ్ లో మొక్కలు నాటిన అధికారులు
  •     'వెలుగు' కథనానికి స్పందన

ధర్మసాగర్​, వెలుగు: ఆక్రమణకు గురైన ఫారెస్ట్​ డిపార్ట్మెంట్​కు చెందిన స్థలంలో ఆ  శాఖ అధికారులు గురువారం మొక్కలు నాటారు. ధర్మసాగర్​ మండలం దేవునూరు శివారు ఇనుపరాతిగుట్టలను ఆనుకుని ఉన్న ఫారెస్ట్​ భూములు అన్యాక్రాంతం కావడం, కొంతమంది పట్టాల పేరున చదును చేసే ప్రయత్నం చేస్తుండటంతో 'వెలుగు'లో గురువారం 'ఇనుపరాతి గుట్టలు ఎవరి పట్టానో' అనే కథనం ప్రచురితమైంది.

దీంతో స్పందించిన అధికారులు ఆ  స్థలంలో మొక్కలను నాటారు.   మొక్కలను తొలగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారం రోజుల క్రితం ఫారెస్ట్ ల్యాండ్ ను చదును చేయడానికి వచ్చిన జేసీబీ ని పోలీస్ స్టేషన్ కు తరలించగా గురువారం పోలీసులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.