జనగామ గ్రీవెన్స్​లో దరఖాస్తుల వెల్లువ

జనగామ గ్రీవెన్స్​లో దరఖాస్తుల వెల్లువ

జనగామ అర్బన్/ మహబూబాబాద్/​ హనుమకొండ/​ ములుగు, వెలుగు: కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనగామలో కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్ అడిషనల్​కలెక్టర్లు పింకేశ్​కుమార్, రోహిత్​సింగ్​లతో కలిసి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 47 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ తెలిపారు. మహబూబాబాద్​లో నిర్వహించిన ప్రజావాణిలో 131 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​అద్వైత్​కుమార్​సింగ్​తెలిపారు. ఆయన కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్​లెనిన్ వత్సల్ టొప్పోతో కలిపి అర్జీలను స్వీకరించారు.

హనుమకొండలో 158 అప్లికేషన్లు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్​వెంకట్ రెడ్డి తెలిపారు. ములుగులో నిర్వహించిన గ్రీవెన్స్​లో కలెక్టర్​దివాకర అడిషనల్​కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి 51 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం డీఎంహెచ్​వో అప్పయ్య ఆధ్వర్యంలో అనీమియా ముక్త తెలంగాణ పోస్టర్​నుఆవిష్కరించారు.

కాలుష్యపు కోరల నుంచి కాపాడాలి 

రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి శ్రీ సత్యనారాయణ హాచరీ(కోళ్ల ఫాం) నుంచి వచ్చే వ్యర్థాల వల్ల సమీపంలోని చెరువులో నీరు కాలుష్యంతో నిండిపోతుందని, కాపాడాలని గ్రామస్తులు సోమవారం వరంగల్​ కలెక్టర్​ సత్య శారదకు వినతి అందించారు. తాగునీటికి ఉపయోగిస్తున్న చెరువు కాలుష్యం బారిన పడకుడా సమస్య పరిష్కరించాలని కలెక్టర్​ను కోరారు.

గిరిజన దర్బార్ వినతులను సత్వరమే పరిష్కరించాలి

ఏటూరునాగారం: ఏటీడీఏ మీటింగ్​హాల్​లో పీవో చిత్రామిశ్ర గిరిజన దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజనుల నుంచి వచ్చిన 30 వినతులను ఆమె స్వీకరించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో భీమ్ రావు, ఎస్​వో రాజ్ కుమార్, ఎస్డీసీ డీటీ అనిల్, అధికారులు పాల్గొన్నారు.