
- ఓగా వెల్నెస్సెంటర్ లో ఫిజియోథెరపి, డెంటల్సర్వీసులు ప్రారంభం
- పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి
గచ్చిబౌలి, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని ఓగా వెల్నెస్సెంటర్లో కొత్తగా ఫిజియోథెరపీ, డెంటల్, ఫేషియల్ఎస్తటిక్స్, ఫిట్నెస్, బాక్సింగ్, జుంబా, యోగా వంటి సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వాటిని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మిసెస్ఏసియా ఫసిపిక్శిల్పా కటారియా సింగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొని గురువారం ప్రారంభించారు.
ఆధునిక టెక్నాలజీతో ఇలాంటి వెల్నెస్సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఓగా వెల్నెస్సెంటర్ఎండీ సంధ్య గోలి, పలువురు పాల్గొన్నారు.