హైదరాబాద్, వెలుగు: తక్కువ ధరల్లో సేవలు అందించడానికి రైడ్ బుకింగ్ యాప్ వోల్టా, రైడ్- హైలింగ్ యాప్ ఓహెచ్ఎమ్ ఆటోమోటివ్ చేతులు కలిపాయి. ఎయిర్పోర్ట్కి రైడ్స్ కేవలం రూ.799 నుంచి మొదలవుతాయి. వీటికితోడు ఇతర ప్రాంతాలకూ సేవలు అందిస్తారు. ఎయిర్పోర్ట్ సిటీ సేవలతోపాటు నగరంలో సేవలు అందించడానికి ఓహెచ్ఎమ్ ఎలక్ట్రిక్ క్యాబ్లనూ ప్రారంభించింది.
తమ వద్ద 600 కంటే ఎక్కువ వెహికల్స్ఉన్నాయని, పర్యావరణ అనుకూల ప్రయాణ సేవలు అందించడానికి ప్రాధాన్యం ఇస్తామని ఓహెచ్ఎమ్ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ క్యాబ్లలో సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు ఉంటాయని వోల్టా ఫౌండర్ శశికాంత్ కనపర్తి, ఓహెచ్ఎమ్ ఫౌండర్ నిర్మల్ రెడ్డి చెప్పారు.