మళ్ళీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు...

మళ్ళీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు...

గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. గత నెలలో పెరిగిన గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. 19కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 39 పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఆదివారం ( సెప్టెంబర్ 1, 2024 ) నుండే అమల్లోకి వస్తాయని తెలిపాయి.పెంపు తర్వాత, ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,691కి చేరింది.

Also Read:-మహబూబాబాద్ వరదల్లో చిక్కుకుపోయిన ఏపీ ఎమ్మెల్యే

అంతకుముందు జూలై 1 న, వ్యాపారాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించే దిశగా..కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు.పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల ప్రభావం టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చిరు వ్యాపారాలపై ప్రభావం చూపనుంది.