ఓలా ఈ–బైకులొచ్చాయ్.. ఒక్క చార్జ్తో 501 కిలోమీటర్లు..!

ఓలా ఈ–బైకులొచ్చాయ్.. ఒక్క చార్జ్తో 501 కిలోమీటర్లు..!

ఎలక్ట్రిక్​ వెహికల్స్ ​తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బుధవారం రోడ్‌‌‌‌స్టర్ ఎక్స్​ సిరీస్‌‌‌‌ ఎలక్ట్రిక్ మోటార్‌‌‌‌ సైకిల్స్ను లాంచ్​ చేసింది. ఇవి 2.5కిలోవాట్ అవర్​, 3.5కిలోవాట్ అవర్,​  4.5 కిలోవాట్ అవర్​ వేరియంట్లలో వస్తాయి. ధరలు వరుసగా రూ. 74,999, రూ. 84,999,  రూ. 94,999గా ఉంటాయి. 

రోడ్‌‌‌‌స్టర్ ఎక్స్​ప్లస్​ 4.5కిలోవాట్ అవర్​ ధర రూ. 1,04,999 కాగా,  రోడ్‌‌‌‌స్టర్ ఎక్స్​ప్లస్​ 9.1కిలోవాట్ అవర్ ధర రూ.1.55 లక్షలు. ఇది ఒక్క చార్జ్తో 501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రోడ్‌‌‌‌స్టర్ సిరీస్ బైక్స్పై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. డెలివరీలు మార్చి మధ్య నుంచి ప్రారంభమవుతాయి.