వృద్ధుడిని ఢీ కొన్న రైలు.. 5 కిలో మీటర్లు ఇంజిన్కు వేలాడిన డెడ్బాడీ

వృద్ధుడిని ఢీ కొన్న రైలు.. 5 కిలో మీటర్లు ఇంజిన్కు వేలాడిన డెడ్బాడీ

హైదరాబాద్: బీబీనగర్ ఘట్ కేసర్ మధ్య జులై 3(ఇవాళ) ఉదయం పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్క డికక్కడే మృతిచెందాడు. 

ప్యాసింజర్ రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకు న్న మృతదేహం ఘట్ కేసర్ వరకు సుమారు 5 కి.మీ. వేలాడుతూ వచ్చింది. అక్కడి రైల్వేగేటు వద్ద రైలు ఇంజిన్ కు చిక్కుకుని వేలాడుతున్న డెడ్బాడీని స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘట్ కేసర్ దాటాక రైలు ఆపించిన ఆర్ పీఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని తొలగించారు.