
- రంగారెడ్డి జిల్లా చీపునుంతలలో ఘటన
ఆమనగల్లు, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి బకెట్ లో పడి ఊపిరాడక వృద్ధురాలు చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటమ్మ(72) కొడుకు హైదరాబాద్లో నివసిస్తుండగా.. ఆమె ఒక్కతే ఇంట్లో ఉంటుంది. శనివారం రాత్రి బాత్ రూమ్ కు వెళ్లిన ఆమె నీటి బకెట్ లో పడి ఊపిరాడక చనిపోయింది. ఆదివారం ఉదయం ఇంటికి పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి చూడగా, అప్పటికే ఆమె చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు.