నిర్మల్​ జిల్లా ముథోల్​ లో ఔరంగజేబు కాలం నాటి నాణాలు

నిర్మల్​ జిల్లా ముథోల్​ లో ఔరంగజేబు కాలం నాటి నాణాలు

నిర్మల్ జిల్లాలో అతిపురాతన నాణాలు దొరికాయి. ముధోల్ లోని మారుతి అనే వ్యక్తి నూతన ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతున్నారు.  పునాదులు తవ్వుతుండగా గడ్డపారకు ఒక మట్టి కుండ తగిలి.. అందులోంచి పురాతన నాణాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇంటి యజమాని  ముధోల్​ ఎస్సై సంజీవ్​ కు సమాచారం అందించారు.

 ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ నారాయణ పంచనామా నిర్వహించి 92 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఔరంగజేబు కాలం నాటివని గుర్తించారు.  ఈ నాణాలను ముధోల్​ ట్రెజరీ ( ఉపకోశాధికారి) కార్యాలయంలో  డిపాజిట్ చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.