
టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా ఒలింపిక్స్ సింగిల్స్లో ప్రిక్వార్టర్స్ చేరిన తొలి ఇండియన్గా రికార్డు సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో మనిక 4-0తో హోమ్ ఫేవరె ట్, 18వ ర్యాంకర్ ప్రీతిక పవాడెను చిత్తు చేసింది.
ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చూపెట్టిన మనిక 11-9 11-6 11-9 11-7 తో ఇండియా సంతతికి చెందిన ప్రీతికను ఉక్కిరి బిక్కిరి చేసింది. టోక్యో ఒలింపిక్స్లో రౌండ్– 32 వరకు వచ్చిన మనిక ఇప్పుడు ప్రిక్వార్టర్స్ చేరి తన రికార్డును తానే మెరుగు పరుచుకుంది.