ఒలింపిక్స్‌లో మోసం చేసినందుకు వినేష్ ఫొగట్‌కు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడు : బ్రిజ్ భూషణ్

ఒలింపిక్స్‌లో మోసం చేసినందుకు వినేష్ ఫొగట్‌కు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడు : బ్రిజ్ భూషణ్

మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ వినేష్ ఫొగట్ పై ఫైర్ అయ్యారు. వినేష్ ఫొగట్ ఒలంపిక్స్‌లో చీట్ చేసి ఫైనల్ వరకు వెళ్లిందని ఆయన శనివారం ఆరోపించారు. అందుకే ఆమెకు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అన్నారు. వినేష్ ఫొగట్‌తోపాటు బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో జాయింన్ అయ్యాయి. 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు జులానా నియోజకవర్గం నుంచి సీటు కూడా కంన్ఫమ్ అయ్యింది. పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ చైర్మన్‌గా నియమించారు. దీంతో బ్రిజ్ భూషణ్ సింగ్ వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. గతేడాది రెజ్లర్లను లైంగికంగా వేధించారని బ్రిజ్ భూషన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన విషయం తెలిసిందే.

బజరంగ్ పునియా ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. ఒలింపిక్‌కు హాజరయ్యేందుకు ఫొగట్ మోసం చేశారని.. దేవుడు ఆమెను శిక్షించినందున ఫోగట్ పతకం గెలవలేకపోయాడని బ్రిజ్ భూషన్ సింగ్ అన్నారు. స్పోర్ట్స్ రంగంలో హర్యానా భారతదేశానికి కిరీటం లాంటిదని చెప్పుకొచ్చారు ఆయన. 

బరువు కొలిచాక ఐదు గంటలపాటు ట్రయల్స్‌కు విరామం ఇస్తారా, ఒకే రోజులో రెండు వెయిట్ కేటగిరీల్లో ట్రయల్స్ ఇవ్వొచ్చా అని వినేష్ ఫోగట్‌ని ప్రశ్నించారు బ్రిజ్ భూషన్. వినేష్ రెజ్లింగ్‌లో గెలవలేదు.. మోసం చేసి అక్కడికి వెళ్లింది. అందుకే ఆమెను దేవుడు నిన్ను శిక్షించాడని అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ అన్నారు.