రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‎ల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‎గా సీవీ ఆనంద్

రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‎ల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‎గా సీవీ ఆనంద్

హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‎ల బదిలీలు జరిగాయి. తాజాగా ఐదుగురు సీనియర్ ఐపీఎస్‎లకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ట్రాన్స్‎ఫర్ చేసి ఆయనను విజిలెన్స్ అండ్ ఎన్స్‏ఫోర్స్‍మెంట్ డీజీగా నియమించింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‎ను హైదరాబాద్ కమిషనర్‎గా అపాయింట్ చేసింది. సీవీ ఆనంద్ స్థానంలో ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‏ను నియమించింది. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్‍కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఇవాళ (సెప్టెంబర్ 7) ఉత్తర్వులు జారీ చేశారు. సీన్సియర్ ఆఫీసర్‎గా పేరున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.