బద్రీనాథ్: ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ముగిసింది. ఈ సీజన్లో మొత్తం 47 లక్షల మంది యాత్రకు వచ్చారని అధికారులు తెలిపారు. భక్తుల రాకతో చార్ధామ్ పరిసరా లు చెత్తమయంగా మారిపోయా యి. దీంతో 50 ‘పర్యావరణ్ మిత్ర’ టీమ్లు చార్ధామ్ పరిసరాలను శుభ్రం చేశాయి. మొత్తం 1.5 టన్ను ల చెత్త పోగైందని అధికారులు వెల్లడించారు. చార్ధామ్ పుణ్యక్షేత్రా ల వద్ద పరిశుభ్రత కోసం చొరవ తీసుకున్న అందరినీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి ప్రశంసిం చారు. సేకరించిన 1.5 టన్నుల చెత్త ద్వారా బద్రీనాథ్ నగర్ మున్సిపాలిటీకి లక్ష రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.