
కంది, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరిని వీడాలని, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెండింగ్లో ఉన్న అలవెన్సులు ఇవ్వాలని, గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సంగారెడ్డిలో ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ఆర్ బీఈఏ సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రకాశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ శామ్యూల్, ఏపీజీవీబీ ఆఫీస్ అసిస్టెంట్ , వర్కింగ్ ప్రెసిడెంట్ అశ్విన్, రీజనల్ సెక్రటరీ రామకృష్ణ, ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ రవికుమార్, రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషనల్ రీజినల్ సెక్రెటరీ పద్మభూషణ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.