బీఆర్ఎస్ కు మరో షాక్: కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ కు మరో షాక్: కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ చేరగా... తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో సమక్షంలో పార్టీలో చేరారు బండ్ల.

కాంగ్రెస్ లోకి బండ్ల చేరికతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క అలంపూర్ స్థానం మినహా బీఆర్ఎస్ ఖాలీ అయ్యింది. అలంపూర్ నుండి విజయుడు బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.