
కోరుట్ల,వెలుగు : పట్టణంలోని కొత్త బస్టాండ్ ఇన్గేట్ వద్ద శుక్రవారం జరిగిన యాక్సిడెంట్లో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుడు ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ తన మారుతి సుజుకీ వ్యాన్లో కామారెడ్డి నుంచి మేడిపల్లి పని మీద బయల్దేరాడు. మార్గ మధ్యలో కోరుట్ల కొత్త బస్టాండ్ ఇన్గేట్ వద్దకు రాగానే జగిత్యాల నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బస్టాండ్ ఇన్గేట్ లోపలికి వెళ్తున్న క్రమంలో వ్యాన్, బస్సు ఢీకొన్నాయి. వ్యాన్ డ్యామేజీ కాగా, డ్రైవర్ ప్రశాంత్ కు గాయాలయ్యాయి.