![అక్కన్నపేట రైల్వేస్టేషన్లో వన్ ప్రొడక్ట్ స్టాల్ ప్రారంభం](https://static.v6velugu.com/uploads/2024/03/one-product-stall-started-at-akkannapet-railway-station_QrE0bRDoUW.jpg)
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ లో భాగంగా స్టాల్ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమానికి రైల్వే సీనియర్ ఇంజనీర్ శ్రీతేజ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కుల వృత్తులు, చేతి వృత్తుల వారు పండ్లు, ఇతర ఉత్పత్తులు అమ్ము కోవడానికి ఈ స్టాల్స్ ఉపయోగపడతాయన్నారు. అనంతరం అజంతా, రాయలసీమ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్ ఇవ్వాలని ఆయనకు స్థానిక నాయకులు వినతి పత్రం అందజేశారు.