
తిరుపతి: వరుస సెలవు రోజులు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా టికెట్ లేకుండానే సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
నిన్న ఒక్కరోజే 82,722 మంది దర్శనం
కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. నిన్న ఒక్క రోజే 82 వేల 722 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మొత్తం 5కోట్ల 11లక్షల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. మరో వైపు తిరుమలలో వసంతోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు తిరుమాడ వీధులలో స్వర్ణరథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
ఇవి కూడా చదవండి
కింగ్ కోఠి ప్యాలెస్ స్వాధీనం కోసం దాడులు చేస్తుండ్రు
హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు
ఈశ్వరప్పను అరెస్ట్ చేయాల్సిందే
ధనుష్ క్లాప్తో ఆశిష్ కొత్త మూవీ
మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే..